పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.