పేలుళ్లపై ముందుగానే హెచ్చరించాం : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ ఉగ్రవాదుల నుంచి దాడుల  ప్రమాదం ఉందని, పేలుళ్లు జరగవచ్చని నిన్న ఉదయమే హైదరాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. హైదరాబాద్‌, బెంగుళూరు. కోయంబత్తూరు, హుబ్లీలలో కూడా పోలీసులను హెచ్చరించినట్లు ప్రకటించింది.