పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఈరోజు పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేసి పేలుళ్ల ఘటనపై చర్చను చేపట్టాలని పట్టుబడతామని ఆయన వెల్లడించారు.