పేలుళ్ల మృతులకు పార్లమెంట్‌ సంతాపం

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభ: కాగానే రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు కలిసికట్టుగా పోరాడాలని కోరారు. లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌ సంతాప సందేశాన్ని చదవి వినిపించారు.