పోలీస్‌ కార్యాలయంపై నుంచి దూకి ఎసిపి ఆత్మహత్య

న్యూఢిల్లీ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  దేశ రాజధాని ఢిల్లీలో ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీపీ ర్యాంక్‌ అధికారి అయిన 55 ఏళ్ల ప్రేమ్‌ వల్లబ్‌.. పోలీసు ప్రధానకార్యాలయం బిల్డింగ్‌ విూద నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. పోలీసు ఆఫీసర్‌ అత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. బిల్డింగ్‌లోని పదవ అంతస్తు నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసీపీ ప్రేమ్‌ను హాస్పటల్‌కు తీసుకువెళ్లినా.. అతను తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు చెప్పారు. ఢిల్లీలోని కైమ్ర్‌ అండ్‌ ట్రాఫిక్‌ యూనిట్‌లో అతను ఆఫీసర్‌గా చేస్తున్నాడు. ఢిల్లీ పోలీసు వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం. . 2016లో ఉత్తమ సేవకు గాను.. ప్రేమ్‌కు పోలీసు మెడల్‌ దక్కింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.