ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకోవాలి.

మర్పల్లి మే 10 (జనంసాక్షి) మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమని మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధిరామప్ప, ఉపాధ్యక్షుడు కొప్పుల ప్రభు అన్నారు. శుక్రవారం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మర్పల్లి మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వరుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయం నుండి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, సుభాష్ యాదవ్, రాముల యాదవ్, రామేశ్వర్, కృష్ణారెడ్డి, దివాకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాండు నాయక్, మల్లేష్ యాదవ్, గఫార్, మాజీ ఎంపీటీసీలు శేఖర్ యాదవ్, పసియోద్దీన్, లింగాయత్ సభ్యులు కోటిగారి లడ్డు పటేల్, వినోద్ స్వామి, బోడోల్ల తిరుపతి, అంకెనపల్లి చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్, పలు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.