ప్రతీయేటా ఐదురోజులు అడవిలో గడిపేవాడిని

– నన్నునేను తెలుసుకోవడానికి ఉపయోగపడేది

– అలాచేస్తే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతాం

– పదేళ్ల వయస్సులోనే హిమాలయాలకు వెళ్లొచ్చా

– ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : తాను యువడికిగా ఉన్నప్పుడు ప్రతీయేటా దీపావళి సమయంలో ఐదు రోజులు అడవిలో ఒంటరిగా గడిపేవాడినని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీనిద్వారా నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలు పెడతారని యువతకు సూచించారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను గుర్తు తెచ్చుకున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయేవాడినని, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడినని చెప్పారు. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడినని, సరిపడా ఆహారం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. రేడియో, దినపత్రికలు ఏవిూ లేకుండా గడిపేవాడిన్నారు. అది తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. అప్పట్లో టీవీ, ఇంటర్నెట్‌ లేవని చెప్పారు. బిజీ జీవితాలకు దూరంగా అలా గడపడం చాలా హాయిగా అనిపించేదని చెప్పారు. రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం విూతో విూరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందని మోదీ యువతకు సలహా ఇచ్చారన్నారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారన్నారు. అప్పడు విూపై విూకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు విూ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు. విూకువిూరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని పేర్కొన్నారు. పదిహేడేళ్ల వయసులో రెండు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్లినట్లు తెలిపారు. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత ఇతరులకు సేవ చేసేందుకు నా జీవితాన్ని ఉపయోగించాలనుకున్నాని అన్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లానని, పెద్ద నగరంలో జీవించడం అప్పుడే తొలిసారి అని గుర్తుచేశారు. అక్కడ అప్పుడప్పుడూ మా అంకుల్‌కు క్యాంటీన్‌లో సాయం చేసేవాడినని, అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారానని అన్నారు. అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ఆరంభించానన్నారు. ఇతరులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం శుభ్రం చేసేవాడిని, టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు చేసేవాడినని అన్నారు. హడావుడి జీవితంలో పడిపోయి హిమాలయాలకు వెళ్లినప్పుడు కలిగిన ప్రశాంతతను కోల్పోకూడదని భావించాను, అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఐదు రోజులు అడవికి వెళ్లి వచ్చేవాడినని మోదీ తెలిపారు. ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని కొందరు అడిగేవారని, నన్ను నేను కలిసేందుకు వెళ్తున్నాను అని చెప్పేవాడినని మోదీ వెల్లడించారు.