ప్రధాని రాజీనామా చేయాలన్న భాజపా

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. 2జీ వ్యవహారంలోకి మాజీ ప్రధాని వాజ్‌ పేయిని లాగడంపై నేతలు మండిపడ్డారు. ప్రధాని రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేస్తోందని ఆ పార్టీ నేత మురళీమనోహర్‌ జోషి తెలిపారు.