ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన భాజపా
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సప్రీంకోర్టుకు సీపీఐ అఫిడవిట్ను సమర్పించిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంపై భాజపా విమర్శల దాడిని పెంచింది. ప్రధాని రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో ప్రధాని కార్యలయం జోక్యం చేసుకుందని మరోనేత జశ్వంత్సింగ్ అన్నారు.