ప్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌కు ఢీల్లీలో ఘనస్వాగతం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సియోన్‌ హోలండ్‌ భారత్‌ పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రితోసహ ఐదుగురు మంత్రులతో కలిసి వచ్చిన హోలండ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆయనకు సాదర స్వాగతం పలికారు. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ పర్యటనలో హోలండ్‌ ఇరు దేశాల వాణిజ్య సంబంధాల బలోపే తంతోపాటు ఫైటర్‌ జెట్స్‌, న్యూక్లియర్‌ రియాక్టర్ల అమ్మకాలు తదితర అంశాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించనున్నారు.