ప్లయ్‌ మై బిజ్‌ కంపెనీలో మహిళలకు ప్రత్యేక సెలవులు

కోల్‌కతా,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కోల్‌కతాలోని ఒక డిజిటల్‌ విూడియా కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ‘ప్లయ్‌ మై బిజ్‌’ అనే ఈ కంపెనీ మహిళా ఉద్యోగినులకు పీరియడ్స్‌ సమయంలో సెలవు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఈ సందర్భంగా ప్లయ్‌ మై బిజ్‌ సీఈవో సౌమ్య దత్తా మాట్లాడుతూ ‘తమ సంస్థలోని మహిళా ఉద్యోగినులకు నెలలో ఒక రోజు అదనంగా సెలవు ఇవ్వాలని నిర్ణయించాం. దీనిని రాబోయే 2019వ సంవత్సరం నుంచి అమలు చేస్తాం. దీనివలన సంస్థలో పనిచేస్తున్న మహిళలు సంవత్సరంలో అదనంగా 12 రోజులు సెలవులు తీసుకోవచ్చు. ఉద్యోగుల సంతృప్తే మా లక్ష్యం. పీరియడ్స్‌ సమయంలో మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటప్పుడు వారు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. దీనిని గుర్తించిన విూదటే మేము మహిళా ఉద్యోగినులకు ప్రత్యేకంగా సెలవు ఇస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ఇక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.