బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదు: బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని అక్కడ స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు సరిపడా గనులు అక్కడ లేవని బొత్స పేర్కొన్నారు. విశాఖస్టీల్‌కు గనులు కేటాయించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తునన్నారు.