బయ్యారం గనులపై సావధాన తీర్మానం ఇచ్చిన తెదేపా

న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బయ్యారం గనులపై ఆందోళన చేపట్టడానికి తెదేపా సిద్ధమవుతోంది. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని తెదేపా నేతలు స్పీకర్‌కు సావధాన తీర్మానం ఇచ్చారు.