బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.