బాంబు పేలుడుకు సంబంధించిన ముగ్గురు అరెస్టు

బెంగళూరు : నగరంలోని భాజపా కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంభందించి ముగ్గురు అనుమానితులను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. వీరిలో పీర్‌ మోహిద్దీన్‌, బషీర్‌ అనే నిందితులను నిన్ను రాత్రి అరెస్టు చేయగా ఈ ఉదయం మరో నిందితుడు బుహారీని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు పోలీసుల సహాయంతో నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు ప్రత్యేక పోలీసు బృందాలు తెలిపాయి.