బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లా నారాయణపురంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.