బాబ్లీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది.బాబ్లీ ప్రాజెక్టును తొలగించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని సుప్రీం నియమించింది. బాబ్లీ ప్రాజెక్టుపై కోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.