బాబ్లీప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన నిజదావాతో పాటు ఎంపీ మధుయాస్కీగౌడ్, తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్రావు, తెరాస మాజీ ఎంపీ వినోద్కుమార్లు వేర్వేరుగా దాఖలు చేసిన కేసులన్నింటిపైనా సుప్రీం కోర్టు ఒకే తీర్పు ఇవ్వనుంది. 2006 జనవరి నుంచి నడుస్తున్న ఈ కేసులో జిస్టిన్ ఆర్ఎం లోధా, జస్టిన్ టీఎన్ ఠాకూర్, జస్టన్ అనిల్ రమేష్ దవేలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరాశరన్, మహారాష్ట్ర తరపున అంద్యార్జున వాదనలు వినిపించారు.