బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్యే స్టేషన్లను మూసివేశారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఇండియా గేట్‌, రైజినా హిల్‌, రేన్‌ కోర్సు ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.