బాలిక అక్రమంగా కోలుకుంటోంది అన్న వైద్యులు

ఢిల్లీ: అత్యాచార బాధితురాలైన బాలిక ఎయిమ్స్‌ ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తల్లిదండ్రులు, వైద్యులతోనూ మాట్లాడుతోందని వారు తెలిపారు. బాలికకు స్వల్పంగా జ్వరంగా ఉందని, నిపుణులైన వైద్యులతో ఆమెకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.