బాలుడిని తలకిందులు వేలాడదీసిన ప్రిన్సిపాల్‌

యూపి ఘటనపై పోలీసుల సీరియస్‌.. అరెస్ట్‌
లక్నో,అక్టోబర్‌30  (జనంసాక్షి) : పాఠశాలలో ఓ విద్యార్థి కొంటే పని చేశాడనే కోపంతో ప్రిన్సిపాల్‌ అతన్ని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీసి దారుణ శిక్షకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని విూర్జాపూర్‌ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. 2వతరగతి చదువుతున్న ఓ బాలుడు పాఠశాలలో కొంటెగా ప్రవర్తించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ మనోజ్‌ విశ్వకర్మ కఠిన శిక్ష విధించాడు. విూర్జాపూర్‌ లోని అహ్రారాలోని సద్భావన శిక్షణ సంస్థాన్‌ జూనియర్‌ హైస్కూల్‌ ప్రైవేట్‌ స్కూలుకు చెందిన 2వతరగతి విద్యార్థి కొంటె పని చేశాడని ప్రిన్సిపాల్‌ మనోజ్‌ విశ్వకర్మ అతన్ని పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీశాడు. ఇతర విద్యార్థులు చూస్తుండగానే చిన్నారి ఏడుస్తూ క్షమించమని వేడుకోవడంతో ప్రిన్సిపాల్‌ అతన్ని పైకి లాగాడు. బాలుడిని పదినిమిషాల పాటు తలకిందులు గా పట్టుకున్నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. విద్యార్థిని తల్లకిందులుగా వేలాడదీసిన చిత్రాలు సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని విూర్జాపూర్‌ జిల్లా మెజిస్టేట్ర్‌ ఆదేశాలు జారీ చేశారు.దీంతో పోలీసులు ప్రిన్సిపాల్‌ మనోజ్‌ విశ్వకర్మపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 352, 506, జువైనల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్ల కింద పిల్లల తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.అరెస్టు చేసిన తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్‌ తన చర్యలపై విచారం వ్యక్తం చేశారు.