బిజెపిలో చేరిన ఒడిషా క్యాడర్ ఐఎఎస్ అధికారి
న్యూఢి/-లీ,నవంబర్27(జనంసాక్షి):త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారణి బీజేపీ పార్టీలో చేరారు. 1994 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అపరాజిత..ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. నవంబర్ 16న వాలంటరీ రిటైర్మెంట్ కోసందరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును అంగీకరించిన బీజేపీ ప్రభుత్వం ఆమె రిటైర్మెంట్ ను ఆమోదించింది. కాగా విధులు నిర్వహణలో అపరాజిత మహత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం జాయింట్ సెక్రటరీగాను.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. అపరాజితను అమిత్ షా వద్దకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా ఆధ్వర్యంలో ఆమె బీజేపీలో చేరారు.