బెంగుళూర్‌ పేలుళ్లలో ముగ్గురు అరెస్టు

చెన్నై; బెంగుళూర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు కేసులో సిట్‌ అధికారులు పురోగతి సాధించారు.ఈ పేలుడు ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.వీరే పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు.చెన్నై పోలీసుల సాయంతో పీర్‌ మొహీద్దిన్‌,బషీర్‌ అనే ఇద్దరిని సిట& అధికారులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. ఇవాల ఉదయం యరో నిందితుడు బుహారని అదుపులోకి తీసుకున్నారు.విచారణ నిమిత్తం ముగ్గురు నిందితులను బెంగళూర్‌కు తరలించారు.