బెయిల్ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : బెయిల్కుంభకోణం కేసులో 8 మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్రెడ్డి సోదరులకు, పట్టాభి రామారావు, చలపతరావులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది.