బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవనాయుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.