బ్యాంకుల మనీలాండరింగ్‌పై నేడు సమీక్షించునున్న ఆర్‌బీఐ

న్యూఢీల్లీ, జనంసాక్షి: ప్రైవేటు బ్యాంకుల మనీలాంరింగ్‌ కేసుపై ఆర్‌బీఐ గురువారం సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఆర్థికసేవల కార్యదర్శి ఆర్‌బీఐ సీనియర్‌ అధికారులతో భేటీ కానున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిన్‌ బ్యాంకుల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది. మనీలాండరింగ్‌కు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.