బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. పలు బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకింగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిన నాలుగు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు.. కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఇచ్చిన హావిూతో మెత్తపడ్డారు. ఈ విలీనంతో ఎదురవనున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కుమార్ హావిూ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేయాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.