బ్లాక్ మనీని తెప్పించే సత్తా ఉంది!

67uc94uqభారతీయులు అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చే సత్తా ప్రధాని మోదీకి ఉందని బిజెపి సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. భారతీయులు అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్ల ధనం రూ.125 లక్షల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు చేపడితే భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 12 శాతం చొప్పున అభివృద్ధి సాధించే సత్తా ఉందన్నారు. అయితే ఇందుకోసం ప్రజలను ప్రేరేపించాల్సి ఉందన్నారు. అయితే ప్రధాని మోదీ చుట్టూ ఇంకా పాత సలహాదారులే ఉండడం వలన ఇది వీలు పడడం లేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఘనత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావుదేనని స్వామి చెప్పారు. ఈ విషయంలో పి.వి సాహసోపేతంగా వివేకంతో వ్యవహరించారని కొనియాడారు