భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంపం

న్యూఢిల్లీ: భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కరీంగంజ్‌లోని సైల్హెత్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది.