భారీ వర్షాలతో గోడకూలి ఐదుగురు మృతి

చండీఘడ్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్‌ లో పలు రాష్టాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వందల ఇళ్లు నేలమట్టం అవ్వగా.. వేలాది వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇక పంజాబ్‌ లో గోడకూలి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. భారీ వర్షాలకు అంబాలా కంటోన్మెంట్‌లోని కింగ్‌ ప్యాలెస్‌ ప్రవారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. పిల్లలు నిద్రపోతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.