భీవండి రసాయన గోదాంలో అగ్నిప్రమాదం

ముంబయి,జూలై23(జ‌నంసాక్షి):  ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్రలో మరోచోట ప్రమాదం చోటుచేసుకుంది. భివాండి ప్రాంతంలోని ఓ రసాయన పరిశ్రమ గోదాములో మంగళవారం ఉదయం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభిస్తామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బాంద్రా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 100 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.