భూ సేకరణ సవరణ బిల్లుపై బహిరంగ చర్చకు రండి : హజారే

హైదరాబాద్‌: భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారని అయితే వారెవరితోనూ తాము మాట్లాడదలుచుకోలేదని తెలిపారు. స్వయంగా నరేంద్ర మోదీ చర్చకు వచ్చి ప్రజల సందేహాల్ని నివృత్తి చేయాలన్నారు.