మంగినపూడి బీచ్‌లో బాలుడు గల్లంతు

విజయవాడ,నవంబర్‌1  (జనంసాక్షి)  : సముద్ర స్నానానికి దిగి బాలుడు గల్లంతయిన ఘటన ఆదివారం సాయంత్రం మంగినపూడిలో చోటుచేసుకుంది. పెడన నుండి వచ్చిన విట్టంశెట్టి జయకృష్ణ (15) ఆదివారం సాయంత్రం మంగిపూడి సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన బాలుడు స్థానిక 11వ వార్డు ఎన్టీఆర్‌ కాలనీ నివాసితులు చేనేత కార్మిక కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోమవారం ఉదయం కూడా గాలింపు కొనసాగుతోంది.