మక్బూల్‌ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలోని తీహార్‌ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది మక్బూల్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లపై అతన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ అధికారులు కూడా అతన్ని ప్రశ్నించే అవకాశముంది.