మక్మూల్‌కు రిమాండ్‌ : తీహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మక్బూల్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 13 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో మక్బూల్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. మక్బూల్‌పై గతంలో దాఖలైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్‌ కోరుతూ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలుచేసింది. హైదరాబాద్‌ పేలుళ్ల కేసులో రియాజ్‌ భత్కల్‌, 9 మందిపై ప్రత్యేక న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.