మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి..

 – డిప్యూటీ డీ.ఏం.అండ్.హెచ్.ఓ.డాక్టర్ గోపాల్ రావు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి)
  “వన్ షాపింగ్” మాల్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ డీ.ఏం.అండ్.హెచ్.ఓ. ఆఫీసు ముందు ఉద్యోగులందరికీ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన వరంగల్ డిప్యూటీ డీ.ఏమ్.అండ్.హెచ్.ఓ. డాక్టర్ గోపాలరావు చేతుల మీదుగా 108 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలు ఎంతో నయం అని చెప్పారు.అంతే కాకుండా మట్టి విగ్రహాలు కొనుగోలు చేస్తే కుల వృత్తికి కూడా ఉపాధి కలుగుతుంది అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మట్టి వినాయక విగ్రహాలనుప్రోత్సహిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధం నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , 104 డ్రైవర్ కుమార్ , లాబ్ టెక్నీషియన్ సతీష్ , క్రాంతి కుమార్, ఫార్మాసిస్ట్ గోపి సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు..