మద్యనిషేదం పై ప్రభుత్వ కృషి:మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మద్య నిషేదమనేది ఒక్కసారిగా అమలు చేస్తే అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు దృష్టిలో ఉంచుకుని  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఒక ప్రైవేటే కార్యక్రమానికి వచ్చిన ఆయన ముందుగా కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని స్పష్టం చేశృరు.రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌కమిటీ నిర్ణయం మేరకు కేటాయించిన నిదులను ఏడాది పూర్తాగా బడుగు,బలహీనవర్గాల కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.