మధ్యాహ్నం 12 వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి:పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఢిల్లీలో చిన్నారి అత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుడాన్‌లో విధినిర్వహణలో మృతి చెందిన భారతీయ శాంతి దళంలో సైనికులకు, ముంబై థానేలో భవనం మృతి చెందిన 74 మందికి, ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపంలో మృతి చెందిన వారికి, బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని విపక్షాలు నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను గంట పాటు వాయిదా వేశారు.