మన్మోహన్సింగ్తో నేడు బ్రిటన్ ప్రధాన భేటీ
న్యూఢిల్లీ : భారత్లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రధాని మన్మోహన్సింగ్తో నేడు భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు హెలికాప్టర్ల కుంభకోణం అంశం కూడా వీరి భేటిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని బ్రిటన్ను భారత్ కోరనున్నట్లు సమాచారం. నిన్న భారత్కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని హెలికాప్టర్ల కుంభకోణంపై స్పందిస్తూ ఇది భారత్, ఇటలీలకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు.