మరింతగా నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : ఈరోజు ఉదయం నుంచీ భారతీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టాక మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి చేరాయి. 1.15 గంటలకు సెన్సెక్స్‌ 192 పాయింట్లు, నిఫ్టీ  59 పాయింట్ల నష్టంలో ఉన్నాయి.