మళ్లీ పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌ : వరసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధర శుక్రవారం పెరిగింది. రూ.125 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,675కు చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కొంతవరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.అలాగే ఈ రోజు వెండి ధర కూడా పెరిగింది. రూ.25 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,325కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు జరపడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.v