మళ్లీ పెరుగుతున్న పెట్రో ధరలు
ముంబై,జనవరి18(జనంసాక్షి): దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రభావంతో జనవరి నుంచి మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది.బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది.