మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గత సంవత్సరం సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో వేలాది దస్త్రాలు దగ్ధమైన విషయం తెలిసిందే.