మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో స్త్రీలు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత, రక్షణ కోసం అంకితం కావటానికి ఇదే సరైన తరుణమని పేర్కొన్నారు. లైంగిక సమానత్వం, న్యాయంతో కూడిన ప్రపంచాన్ని స్థాపించేందుకు అందరం కృషి చేయాలని సూచించారు.