మాదకద్రవ్యాలపై కౌన్సిలింగ్‌

విజయవాడ,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) మాదకద్రవాలపై ఎస్పీ సిద్దార్థ కౌశిల్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మద్యం, అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్‌, నకలి సారా తయారీ, గుట్కా కేసులో ఉన్న 2,500 మందికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో డ్రగ్స్‌ అక్రమ రవాణాపై విమర్శల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై అవగాహన కార్యక్రమం చేపట్టి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.