మాధవనేని రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించాలి.

దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి )

మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు కెంబసారి మల్లేష్, తాజా మాజీ ఉప సర్పంచ్ బొల్లం స్వామి, దౌల్తాబాద్ మండల సోషల్ మీడియా కన్వీనర్ బండి రాజు, సీనియర్ నాయకులు ఏలూరి నర్సింలు, తోడంగి స్వామి, తైల మల్లేశం, తలారి రాజు, కంఠం బాల్ నర్స్, పుల్ల కరుణాకర్, దోమల భాను ప్రసాద్, కడారి రాజు, బొల్లం నాగరాజు, వడ్డే వెంకటేష్ మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.