మానవత చాటుకున్న తోటి పోలీసులు

హత్యకు గురైన పోలీస్‌ అధికారికి 70 లక్షల విరాళం

లక్నో,జనవరి19(జ‌నంసాక్షి): గత ఏడాది డిసెంబర్‌లో అల్లరిమూకల దాడిలో మృతిచెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీసు ఆఫీసర్‌ సుబోద్‌ కుమార్‌ సింగ్‌ కోసం తోటి పోలీసులు దాతృత్వం చాటుకున్నారు. ఆ ఆఫీసర్‌ కుటుంబానికి యూపీ పోలీసులు 70 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ సీనియర్‌ ఆఫీసర్‌ ఫ్యామిలీకి ఇప్పటికే యూపీ ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం ఇచ్చింది. దానికి అదనంగా యూపీ పోలీసులు కూడా ఇప్పుడు 70 లక్షలు ఇచ్చారు. బులంద్‌షెహర్‌లో గోవు కళేబరాలు కనబడడంతో కొందరు ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఆందోళన సమయంలో చోటుచేసుకున్న విధ్వంసంలో ఆఫీసర్‌ సుబోద్‌ కుమార్‌ మరణించాడు. బజరంగ్‌దళ్‌ నేత యోగేశ్‌ రాజ్‌ .. ఇన్స్‌పెక్టర్‌ సుబోద్‌ను హత్య చేసినట్లు ఆ తర్వాత పోలీసులు గుర్తించారు.