మావోల కాల్పుల్లో జవాన్ మృతి
భువనేశ్వర్,ఆగస్ట్28 (జనంసాక్షి): మల్కన్గిరి జిల్లా బొండా ఘాట్ పరిసర ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా మరో జవాను గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. డిస్టిక్ట్ వాలంటరీ ఫోర్స్(డీవీఎఫ్) సిబ్బంది, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్వోజీ) సంయుక్తంగా మావోయిస్టుల ఆచూకీకి గాలింపు చర్యలు చేపట్టారు.