ముంబయిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ముంబయి : నాలుగేళ్ల చిన్నారు పాఠశాల బస్సులో అత్యాచారానికి గురైన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చిన్నారి పాఠశాల బస్సులో ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో చిన్నారి తప్ప  బస్సులో ఇంకా ఎవరూ లేకపోవడంతో బస్సు కండెక్టరే ఈ అఘాయిత్యానికి  పాల్పడి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. బస్సుకు ఎలాంటి అనుమతులు లేనట్లు పోలీసులు గుర్తించారు.