ముంబైలో భారీ అగ్ని ప్రమాదం 

నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఎగిసిపడిన మంటలు
ముంబై,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):సెంట్రల్‌ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్‌ సముదాయానికి సవిూపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఐదు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఈనెలలో ముంబయిలో జరిగిన మూడో అగ్ని ప్రమాదం ఇది. డిసెంబర్‌ 17న అంధేరిలోని ఐదు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగగా పది మంది మరణించారు. 27న చెంబుర్‌లో ఓ భవంతిలో అగ్ని ప్రమాదం జరగగా ఐదుగురు వృద్ధులు మృతి చెందారు. గతేడాది డిసెంబర్‌ 29న కమల మిల్స్‌ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.